YSRCP MLA Jyothula Nehruజంపింగ్ లకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారం ప్రతిపక్ష పార్టీ వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకిస్తూ టీడీపీలో చేరిపోగా, తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు ‘సైకిల్’ ఎక్కేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్లు మీడియా వర్గాల వేదికగా సందడి చేస్తున్న సమాచారం.

ఈ 10 మందిలో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే జ్యోతుల నెహ్రూ సహా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు పొలిటికల్ వర్గాల టాక్. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. కాకినాడ వేదికగా మొదలైన ఈ ‘జంపింగ్’ వార్తలు మొత్తం రాష్ట్రంలోనే పెను చర్చకు దారి తీశాయి. ఇదే జరిగితే, వైసీపీ నుంచి ఏకంగా 18 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం టీడీపీలో చేరినట్టవుతుంది.