తెలుగు హీరోయిన్లను యుఎస్ కు పిలిపించి, వారితో శృంగారం చేయించిన కిషన్ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో విక్టిమ్ ఏగా తెలుగు హీరోయిన్ పేరును చేర్చినట్లు అమెరికా పోలీస్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు తాజాగా సదరు హీరోయిన్ సహకరించడం లేదని తెలుస్తోంది. తన పేరు బయటకు వస్తే అవకాశాలతో పాటు పరువు కూడా పోతుందనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనేది టాలీవుడ్ టాక్.
పోలీసుల విచారణలో భాగంగా… ‘తాను యుఎస్ వెళ్ళిన మాట వాస్తవమే గానీ అక్కడ ఎవరితో శృంగారం చేయలేదని, కాసేపు కాలక్షేపం మాత్రమే చేసానని, తనకు కావాల్సిన సహాయం గురించి వారితో మాట్లాడానని’ చికాగో పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే యుఎస్ పోలీసులు విటుడి నుండి కూడా వివరాలు సేకరించగా, తొలుత అంగీకరించని సదరు విటుడు, తర్వాత నిజం ఒప్పుకున్నట్లుగా సమాచారం.
ఓ హీరోయిన్ కోసం 1100 డాలర్లు (షుమారు 75 వేలు) చెల్లించినట్లుగా సదరు విటుడు అంగీకరించాడని, అయితే హీరోయిన్లు మాత్రం విచారణకు సహకరించడం లేదని టాలీవుడ్ వర్గాల టాక్. విక్టిమ్ ఏతో పాటుగా ఇతర హీరోయిన్ల పోకడ కూడా ఇలాగే ఉండడంతో, ఇందులో నిజానిజాలు ఎలా బయటకు వస్తాయో చూడాలి. విచారణలో కిషన్ భార్య చంద్రకళ రాసిన డైరీనే యుఎస్ పోలీసులకు అత్యంత కీలక సమాచారాన్ని ఇచ్చింది.