tirupati-hundiతిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు వాటా రావాలని హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న‌కు ముందు 2002-13 మ‌ధ్య‌ వరకు టీటీడీ ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1000 కోట్లు వాటా రావాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాను హైకోర్టు ఇప్పించాలని ఈ సందర్భంగా కోరారు.

సౌందరరాజన్ వేసిన ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీక‌రించింది. ఈ అంశంపై త‌మ‌కు మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని టీటీడీతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌ర్కారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. విభజన ప్రక్రియతో ఏపీకి చెందాల్సిన ఆస్తులు సరిగా రాలేదని మొత్తుకుంటున్న ఏపీ సర్కార్ కు, ఇప్పుడు ఈ పిల్ మరో షాక్ ఇవ్వనుందా? ఒక దేవాలయ అర్చకుడు ఈ పిటిషన్ ను దాఖలు చేసారంటే నమ్మలేని పరిస్థితి. దీంతో ఈయన వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? అన్నది హాట్ టాపిక్ అయ్యింది.