telangana-state Congressకాంగ్రెస్ అభ్యర్దుల జాబితా అంటూ టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు ఆ పార్టీలో టెన్షన్ పెంచుతున్నాయి. పలువురు టిక్కెట్లు రాని వారు ఆందోళనలకు దిగుతున్నారు.ఏకంగా డిల్లీలోనే దర్నాలు చేసే పరిస్థితి వస్తోంది. దీనితో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి రెండు కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

హై కమాండ్ తో ఇంకా సంప్రదింపులు సాగుతున్నాయని ఆయన తెలిపారు. టీవీ న్యూస్‌ ఛానల్స్‌, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తోన్న జాబితాలు నిజం కాదని, ఇంకా ఎటువంటి జాబితా సిద్ధం కాలేదని ఉత్తమ్‌ వెల్లడించారు. ప్రచారంలో ఉన్న జాబితాలు నిజం కాదని, అవి ఊహాజనీతం, కల్పితం మాత్రమేనని తెలిపారు.

మొత్తానికి ఏదో రకంగా కాంగ్రెస్ మొదటి జాబితా వస్తుందని సంబరపడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మరోవైపు మహాకూటమిలోని మిత్రులకు సీట్ల పంపకంపై కూడా కాంగ్రెస్ తాత్సారం చేస్తుంది. కనీసం 90 స్థానాలలో పోటీ చెయ్యాలని కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అదే సమయంలో అసలు గెలిచే అవకాశం లేదు అనే సీట్లను మిత్రులకు అంటగడదాం అని కూడా చూస్తుంది.