Telangana IT Secretary jayesh ranjan satire on KTRఅమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గారాల పట్టి, వైట్ హౌస్ సలహాదారు, ఇవాంక ట్రంప్ మంగళవారం తెల్లవారు జామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరో వైపు ఆమె పర్యటన కోసం హైదరాబాద్ శత్రుదుర్బేధ్యంగా మారింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఇవాంక పర్యటనను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నవ్వుతూ మా ఐటీ సెక్రటరీ జయేష్ రంజాన్ ఇవాంకకు సెక్రెటరీగా మారిపోయారు అన్నారు. దానికి నోచుకున్నారో ఏమో వెంటనే జయేష్ రంజన్ తిరిగి ఇంకో పంచ్ మంత్రిగారికి వేసేసారు.

“నేను ఇవాంకకు సెక్రెటరీగా మారితే కేటీఆర్ ఆమెకు ఐటీ మంత్రిగా మారిపోతారు,” అని ఆయన అన్నారు. ఆయన ఆ మాట అనగానే కేటీఆర్ కొంచెం ఇబ్బంది పడినా నవ్వు మొహం పెట్టారు. మరో వైపు అంతర్జాతీయ సదస్సు, మెట్రో రైల్ లాంచ్ ఒకేరోజు రావడంతో తాను మంత్రిగా ఉన్న కొద్దీ కాలంలో ఈరోజు అత్యంత బిజీ రోజు అని కేటీఆర్ అన్నారు.