KCR Close aide r vidyasagar-rao no moreతెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు, ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, మాజీ చీఫ్ ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్ రావు తుది శ్వాస విడిచారు. ఎక్స్ టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన, ఉదయం 11.23 గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో సైతం చురుకుగా పాల్గొన్న విద్యాసాగర్ రావు… ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితులు. ఇటీవలే ఆసుపత్రికి వెళ్లి మరీ విద్యాసాగర్ రావును కేసీఆర్ పరామర్శించారు. గత రెండేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్ రావు… ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నెల 22న ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి… కీమోథెరపీ అందిస్తున్నప్పటికీ, ఫలితం లేకపోయింది.