Telangana Native Employees in Andhra Pradesh Going Backసుమారు వెయ్యి మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులు విభజన నేపద్యంలో తెలంగాణ నుంచి ఎపికి వెళ్లవలసి వచ్చింది. వారు తమను వెనక్కి పంపించాలని ఎప్పటినుండో కోరుతున్నారు. ఉద్యమాలు కూడా చేసారు. వారిలో చాలా మంది అవస్థలు పడి అమరావతికి వెళ్లాల్సిరావడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది.

మొత్తానికి ఆ ఉద్యోగులు సొంత రాస్ట్రానికి వెళ్లడానికి మార్గం సుగమమం అవుతోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో సంక్రాంతి నాటికి వారు తిరిగి తెలంగాణ కు రావడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఈ వార్తలతో ఆయా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ ఉద్యోగులు తమ సీనియారిటీ, ర్యాంకు నిలుపుకుంటారు. ప్రభుత్వంలో రిటైర్మెంట్ల తో ఏర్పడిన ఖాళీలను వీళ్ళతో భర్తీ చేస్తారు. అవసరమైన చోట్ల సూపర్ న్యూమరీ పోస్ట్లు సృష్టించి వారిని వాటిలోకి తీసుకోనున్నారు.