ఈరోజు టబు 48వ బర్త్డే. ఈ సందర్భంగా అల వైకుంఠపురములో టీం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ఆమె. తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లిపోయారు. అందమైన కళ్లు, చక్కని చిరునవ్వుతో ఫస్ట్లుక్లో టబు చాలా గార్జియస్గా కనిపిస్తున్నారు.
ఇప్పటికీ ఆమె అందం ఇసుమంతైనా తగ్గలేదు. ఆ చిత్రంలో టబు ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అని సమాచారం. ఏకంగా ఈ పాత్ర కోసం టబుకు చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారట. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో నటీమణుల పాత్రకు వెయిట్ ఉంటుంది. మరి ఈ సినిమాలో టబు పాత్ర ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
టీమ్ ప్రస్తుతం ఒక పాట చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ వెళ్ళింది. బన్నీ, పూజా హేగ్డే పై ఒక రొమాంటిక్ పాట అక్కడ షూట్ చేయబోతున్నారు. డిసెంబర్ మొదటి వారం నాటికి మొత్తం షూటింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అనూహ్యమైన రెస్పాన్స్ తో సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అల వైకుంఠపురములో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా అదే రోజున విడుదల చేస్తున్నాం అంటూ ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడం విశేషం. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.