శ్రీ సత్యసాయి జిల్లాలో జోరుగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధర్మవరం పట్టణంలో టిడిపి కార్యాలయంలో బుదవారం పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం జరిగింది. మాజీ జెడ్పీటీసీ మేకల రామాంజనేయులు, టిడిపి సీనియర్ నాయకుడు చింతలపల్లి మహేశ్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 20 పంచాయతీలలోని మండలాలు, గ్రామాలకు చెందిన గోటూరు శివయ్య, ఎలకుంట్ల రమణ, అశోక్ వాల్మీకి, జంగం నరసింహులు, చిన్నూరు విజయ్ చౌదరి, గుత్తాసూరి, చిత్రా నారాయణ స్వామి, రాంపురం శీన, విజయసారధి, రేగాటిపల్లి నాగేంద్ర రెడ్డి, గరుడంపల్లి అంజి, చంద్రాయుడు, అమర సుధాకర్, జయప్రకాష్ రెడ్డి, నాగేంద్ర రెడ్డి,పోతుకుంట రమేష్, చంద్రశేఖర్, తాతిరెడ్డి, కాటమయ్య, వెంకటేష్, పారేష్ తదితరులు హాజరయ్యారు.
జిల్లా కేంద్రమైన పుటపర్తి పరిధిలో కర్ణాటకనాగేపల్లిలో బుదవారం టిడిపి నాయకులు రాజప్ప, శ్రీరాములు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా కొత్తగా అనేక మంది వంద రూపాయలు చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకొన్నారు. వారందరికీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు జీవితభీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు రాజప్ప తెలిపారు. ఈ కార్యక్రమం ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్, తెలుగు యువత నియోజకవర్గ కార్యదర్శి రాము నాయకులు, పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.