Kasturi-Viswanadha-Naidu-అన్నమయ్య జిల్లాలో చిట్వేలి మండలంలో కె.కందులవారి పల్లెలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు అధ్వర్యంలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందుల గుండయ్య నాయుడు, మాజీ టిడిపి మండల అధ్యక్షుడు ఏదోటి రాజా, టిడిపి మహిళా అధ్యక్షురాలు అనితా దీప్తి, పార్లమెంట్‌ వాణిజ్య విభాగం ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజశేఖర్, పార్లమెంట్‌ తెలుగు యువత అధికార ప్రతినిధి బాలకృష్ణ యాదవ్, ఉపాధ్యక్షుడు రమణ యాదవ్, నగిరిపాడు సర్పంచ్ కస్తూరి రవీంద్ర, టిడిపి స్థానిక నాయకులు కస్తూరి శ్రీధర్, అనంత్ విశ్వాస్, విశ్వనాథ్, పి.రమేశ్ బాబు, తులసి, వెంకటేష్, జె.చంద్ర, సిద్దయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లాలోనే వీరబల్లి మండలం టిడిపి అధ్యక్షుడు ముద్దులూరి భానుగోపాల్ రాజు అధ్వర్యంలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన టిడిపి నేతలు, కార్యకర్తలతో కలిసి తాటిగుంటపల్లె పంచాయతీ పరిధిలో రెడ్డివారిపల్లె, పాపిరెడ్డిగారి పల్లె, ఎస్సీ కాలనీలలో ఇంటింటికీ తిరిగి జగన్మాయ పేరుతో ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టి సామాన్య ప్రజలను జగన్ ప్రభుత్వం ఏవిదంగా మోసం చేస్తోందో వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రాజు, మండల కమిటీ ఉపాధ్యక్షుడు దుర్గం ఆంజనేయులు, మాజీ సర్పంచ్ నేతి వెంకట్రమణ, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్, స్థానిక టిడిపి నాయకులు వర్ల ఆంజనేయులు, సిద్ధిరాజు, మల్లికార్జున, నాగప్ప నాయుడు, రవిరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.