దక్షిణాది నుండి వచ్చిన ఒక చిత్రం తమ మూలలను సైతం కదిలించడం తట్టుకోలేకపోయారో ఏమో, బాలీవుడ్ మీడియా తన అక్కసు అంతా ప్రభాస్ సాహూ చిత్రం మీద చూపిస్తుంది. ఈరోజు విడుదలైన సినిమా నెగటివ్ టాక్ వచ్చింది నిజమే… కానీ బాలీవుడ్ సినీవిమర్శకులు చేస్తున్న విమర్శలు చూస్తే వారి కడుపుమంట అర్ధం అవుతుంది. బాలీవుడ్ క్రిటిక్స్ కు ఆధ్యుడు అని చెప్పుకునే తరన్ ఆదర్శ్ అంటే మన వాళ్ళకు బాగా మోజు.
మొన్న ఆ మాధ్య ఆయనకు మహేష్ బాబు తన మల్టీప్లెక్స్ చూపించడానికి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి స్పెషల్ షో వేయించాడు. మన సినిమాల విశేషాలు, అప్ డేట్స్, ట్విట్టర్ లో పెట్టడానికి అతనికి ప్రత్యేకంగా ముట్టచెబుతారు కూడా. చివరకు ఆయన కూడా బుద్ధి చూపించాడు. సినిమాకు కేవలం 1.5 స్టార్స్ ఇచ్చి అన్ బీరబుల్ అన్నాడు. మిగతా విమర్శకుల దారి కూడా అంతే. తమిళ మీడియా కూడా ఏం తక్కువ తినలేదు. మామూలుగానే వాళ్ళకు మా హీరోలే హీరోలు అనే ఫీలింగ్.
నార్త్ లో రజినీకాంత్ సినిమాలు కూడా సాధించని విజయం బాహుబలి 2 సాధించడంతో తిక్క మీద ఉన్నారేమో సినిమా మీదకు ఎక్కిస్తున్నారు. కొందరైతే ఏకంగా అసలు ప్రభాస్ కు యాక్టింగే రాదు అన్నట్టు రివ్యూలు రాసేస్తున్నారు కూడా. ట్రాజెడీ ఏంటంటే సాహూ బృందం సినిమా మొత్తం పక్క భాషల ప్రేక్షకుల కోసమే తీసినట్టుగా తీశారు. పప్రమోషన్స్ పేరుతో ప్రభాస్ ఇక్కడ కంటే అక్కడే ఎక్కువ తిరిగాడు. ఈ ఫలితం, ఈ రెస్పాన్స్ నుండి బయటపడటానికి అతనికి ఎక్కువ కాలమే పట్టొచ్చు.