Tamil Nadu Bus conductor got memo as pigeon travels ticketless!తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న హరూర్‌ టౌన్‌ బస్సులో ఓ వ్యక్తి పావురంతో కలిసి ప్రయాణించాడు. మార్గ మధ్యంలో అధికారులు బస్సెక్కి తనిఖీలు నిర్వహించారు. బస్సులో అందరూ టికెట్ తీసుకున్నారు. పావురంతో ప్రయాణించిన వ్యక్తి ఆ పావురానికి టికెట్ తీసుకోలేదు. దీనిని గుర్తించిన అధికారి కండక్టర్ ను నిలదీశారు. అయితే అతను బస్సెక్కేటప్పుడు అతని చేతిలో పావురం లేదని సమాధానం ఇచ్చారు.

దీంతో మరింత ఆగ్రహానికి గురైన అధికారి, కండక్టర్ కు మెమో జారీ చేశారు. దీంతో ఆ కండెక్టర్ తన కోపాన్ని ప్రయాణికుడిపై కోపం ప్రదర్శించారు. పావురానికి టికెట్ తీసుకోలేదని కండక్టర్ కు చెకింగ్ ఆఫీసర్ మెమో ఇచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. తనిఖీ అధికారులు ఇలాక్కూడా మెమోలు జారీ చేస్తారా? అంటూ సోషల్ మీడియాలో సదరు అంశం వైరల్ అవుతోంది.