tamil-director-as-villain-in-mahesh-murugadoss-movieప్రస్తుతం “బ్రహ్మోత్సవం” సినిమాలో నటిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుండగా, ప్రస్తుతం ఈ సినిమా తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో చిత్ర దర్శకుడు మురుగదాస్ నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఈ సినిమా విలన్ పాత్రకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన విషయం హల్చల్ చేస్తోంది.

ఓ తమిళ దర్శకుడు ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ తమిళ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ గడ్డంతో రౌడీలా కనపడే సముద్రఖని అని కొందరు, ‘నాని’ సినిమా దర్శకుడు ఎస్.జే.సూర్య అని మరికొందరు ఇలా ఒకరిద్దరి తమిళ దర్శకుల పేర్లు ప్రధానంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు మురుగదాస్ తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కావడంతో, మరో తమిళ దర్శకుడిని ఎవరిని ఎంపిక చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది.

విలన్ తో పాటు ఈ సినిమాలో ప్రిన్స్ సరసన నటించబోయే హీరోయిన్ కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదని సమాచారం. దాదాపుగా బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోయిన్ల నుండి కొత్తగా వచ్చిన కీర్తి సురేశ్ వంటి భామల పేర్లన్నీ వినపడగా, ఎవరినీ ఎంపిక చేసారనే విషయం బహిర్గతం కాలేదు. బహుశా చిత్ర ప్రారంభ రోజున వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.