Syeraa Narasimha Reddy movie updatesసురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ శరవేగంగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనుండగా, మెగాస్టార్ కు జతగా నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఆంగ్లేయ సైన్యంపై నరసింహారెడ్డి… ఆయన అనుచర గణం విరుచుకుపడే పోరాట సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

సిల్వర్ స్క్రీన్ పైన ఈ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయనీ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనేది ట్రేడ్ టాక్. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ తదితరులు కనిపించనున్నారు.