Sye Raa Narasimha Reddy -release in 2020మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘సైరా’ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ కు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఏడాది క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ రిలీజ్ చేశారు, ఆ తరువాత అప్పుడప్పుడూ కొన్ని క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చెయ్యడం తప్ప సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యలేదు. ఈ నెల 14 నుండి ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు.

ఆ రోజు సినిమాకు సంబంధించిన ఒక మేకింగ్ వీడియో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా సినిమాను ఎంత భారీ స్థాయిలో నిర్మించారు అనేది ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా చూపించబోతున్నారట. ఆ తరువాత చిరంజీవి బర్త్ డేకి థియేటర్ ట్రైలర్, కొన్ని ఈవెంట్లు, బాలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇలా చాలానే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆగస్టు 14 మొదలుకొని విడుదల వరకూ చాలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా ,దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, విజయ సేతుపతి, అమితాబ్, తమన్నా వంటి స్టార్ కాస్ట్ ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించడం వల్ల సినిమాకు ఉత్తరాదిన కూడా హైప్ వస్తుందని మెగా కుటుంబం ఆశాభావంగా ఉంది. చూడాలి ఏం జరగబోతుందో!