Sye Raa Narasimha Reddy leaked dialoguesమెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న “సైరా” సినిమాకు సంబంధించిన శాంపిల్ లుక్ ను చూసుకుని అభిమానులు ఎంతగానో మురిసిపోయిన విషయం తెలిసిందే. నరసింహారెడ్డిగా చిరు ఉగ్ర రూపానికి ఫిదా అయిన అభిమానుల కోసం రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’లో ఓ డైలాగ్ ను లీక్ చేసారు.

ఈ విషయం తెలిస్తే చిరంజీవి కాస్త ఆగ్రహరిస్తారని తెలుసు, అయినా మీపై ఉన్న అభిమానంతో కావాలనే ఈ డైలాగ్ ను లీక్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చేతులిరిచి కట్టేసి… “ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది, ఏంట్రా ఆ ధైర్యం, సావు భయం లేదా నీకు?” అంటే “సచ్చి పుట్టినవాడిని, సనిపోయిన తరువాత కూడా బతికేవాణ్ణి, సావంటే నాకెందుకురా భయం” అనేది కథానాయకుడి డైలాగ్ గా తెలిపారు.

అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే… ఆ లీక్ చేసిన డైలాగ్ చిరంజీవి పాత్ర క్లైమాక్స్ లో ముగిసిపోతుందని స్పష్టం చేసారు. తెలుగు గడ్డ మీద తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరుగాంచిన సైరా మరణిస్తారన్న విషయం తెలిసిందే గానీ, ఆ పాత్రను చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి మరణిస్తారని అంటే అభిమానులు ఒప్పుకుంటారా?! లేదా? అనేది వేచిచూడాలి.