swaroopanandendra swamy - ys jaganఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఫేవరెట్ స్వామిజీ… స్వరూపానందస్వామి. ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు అనుకూలంగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఈ స్వామిజీ ఆశ్రమం నిత్యం రాజకీయ నాయకుల రాకపోకలతో బిజీగా ఉంటుంది. అయితే కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వాల కంటే దేవుళ్లను, స్వామిజీలను ఎక్కువ నమ్ముకుంటారు.

గత ఏడాది కరోనా సమయంలో మే 5 నాటికి కరోనా అంతమైపోతుందని చెప్పుకొచ్చారాయన. అంతమైపోవడం దేవుడెరుగు ఇప్పుడు అది మరింత పెరిగి జనాలను వేల సంఖ్యలో పొట్టనపెట్టుకుంది. దాని గురించి అడుగుతారేమో అన్నట్టుగా చాలా కాలం స్వరూపానందస్వామి మీడియాకు మొహం చాటేశారు. తాజాగా ఆయన మరోసారి కరోనా విషయంలో జోస్యం చెప్పారు.

ఇటీవలే ఆ మే 5 కు ఏడాది పూర్తి కావడంతో తన మీద సెటైర్లు రావడంతో… మరోసారి జూలై చివరి కల్లా.. కరోనా తగ్గిపోతుదంని అంటున్నారు ఈ స్వామిజీ. పైగా కొంత మంది అవగాహన లేని వ్యక్తులు.. మే ఐదో తేదీ కల్లా.. వైరస అంతమవుతుందని చెప్పారని ప్రచారం చేస్తున్నారని… కానీ తాము అలా అనలేదని మాట మార్చారు.

ఇటీవలే జరిగిన ఉగాది పంచాంగ శ్రవణంలోనూ అదే చెప్పామని స్వరూపానంద చెప్పుకొచ్చారు. సైన్స్ కు అందని వైరస్ స్వామిజీలకు అందుతుందా? అది కూడా చెప్పిన విషయం తప్పయినప్పుడల్లా కొత్త డేట్లు ఇస్తూ పోయే స్వామీజీలు. ప్రజలే కొంత విజ్ఞతతో ఆలోచించాలి.