Chiranjeevi - Meher Ramesh - Mahathi Swara Sagar-Mani Sharma-తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం… వేధలం తెలుగు రీమేక్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ తో జతకట్టనున్నారు. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే ఈ ప్రాజెక్టును ఎకె ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్‌కు చెందిన అనిల్ సుంకర నిర్మించనున్నారు.

యంగ్ మ్యూజిక్ కంపోజర్, మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఖరారు చేయబడ్డారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంగీత సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. చిరంజీవి ఆచార్య కోసం మణి శర్మ సంగీతం చేస్తున్నారని మన పాఠకులకు తెలుసు. ఆ రకంగా తండ్రీకొడుకులు ఇద్దరితోనూ చిరంజీవి పని చెయ్యబోతున్నారు.

మణి శర్మ గతంలో చిరంజీవి కోసం కొన్ని చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించారు. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్లో సాయి పల్లవి చిరంజీవి సోదరిగా నటించే అవకాశం ఉంది. చిరంజీవికి ప్రస్తుతం ఆచార్య కాకుండా బాబీతో ఒక సినిమా… వినాయక్ తో లూసిఫర్ రీమేక్… ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు ఏది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియాల్సి ఉంది. ముగ్గురు డైరెక్టర్లు తమ సినిమాలకు చెందిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు. అయితే మెహర్ రమేష్ మాత్రం తన సన్నిహితులతో తన సినిమా 2021 చివరన విడుదల అవుతుందని చెప్పుకుంటున్నాడట.