స్వామీ పరిపూర్ణానంద విషయంలో తెలంగాణ పోలీసులు కొద్దిగా అతిగా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. తనపై బహిష్కరణ హైదరాబాద్ పరిధి వరకే పరిమితం కావడంతో సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్ రావడానికి రాజమహేంద్రవరం నుండి ఫ్లైట్ టిక్కెట్టు బుక్ చేసుకున్నట్టు సమాచారం.
ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ఆయనను బహిష్కరించనున్నట్టు సమాచారం. కత్తి మహేష్ నగర బహిష్కరణ తరువాత ఓ వర్గాన్ని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారన్న ఆరోపణలతో పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించారు తెలంగాణ పోలీసులు. ఏదైనా విషయం వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా నిముషాలలో దేశాలు దాటే ఈ రోజుల్లో నగర బహిష్కరణతో ఒక మనిషిని కట్టడి చెయ్యగలరా?