‘భరత్ అనే నేను’ సినిమాలో ఆన్ స్క్రీన్ ముఖ్యమంత్రిగా నటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన ప్రిన్స్ మహేష్ బాబు, తన కొత్త చిత్రం షూటింగ్ ను ప్రారంభించాడు. డెహ్రాడూన్ వేదికగా ప్రారంభమైన నేటి షెడ్యూల్ లో ప్రిన్స్ మహేష్ బాబు పాల్గొనగా, ఈ షూటింగ్ స్పాట్ లో రీల్ సిఎంతో పాటు రియల్ ముఖ్యమంత్రి కూడా దర్శనమివ్వడం విశేషం.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ లో ఉత్తరాఖండ్ సిఎం త్రివేండ్ర ఎస్ రావత్ పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వైపు మహేష్ బాబు, మరో వైపు దర్శకుడు వంశీ పైడిపల్లిలు ఉన్న ఈ పిక్ లో ప్రిన్స్ కాస్ట్యూమ్స్ కలర్ ఫుల్ గా కనపడుతున్నాయి. ఫాదర్స్ డే నాడు నమ్రత రిలీజ్ చేసిన పోస్టర్స్ లో గడ్డం, మీసాలు లేకపోవడంతో కంగారుపడిన ఫ్యాన్స్ కు ఈ పిక్ ఊరటనిచ్చింది.