వెస్టిండీస్ తో అమెరికాలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కు వెళ్లిన ఇండియన్ క్రికెట్ లెజండ్ సునీల్ గవాస్కర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నాడు లాడర్ హిల్ లో టీ-20 పోటీ ఆరంభానికి ముందు స్టేడియం వద్దకు వెళ్లిన గవాస్కర్ ను లోనికి వెళ్లనిచ్చేందుకు భద్రతాధికారులు అంగీకరించలేదు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, సన్నీ వద్ద సంబంధిత పాస్ లేకపోవడమే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు కారణమని తెలుస్తోంది.
గవాస్కర్ ను గుర్తించని భద్రతా సిబ్బంది స్టేడియం ముందే నిలిపివేయగా, అక్కడే ఉన్న అభిమానులు గవాస్కర్ ఎవరో చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు వినలేదు. దీంతో చేసేదేమీ లేక అభిమానులతో ఫోటోలు దిగుతూ, వారితో ముచ్చటిస్తూ ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, వచ్చి చెప్పిన తరువాతనే గవాస్కర్ ను స్టేడియంలోనికి అనుమతించారు.