No-Loud-Comedy-from-Sunil‘మర్యాద రామన్న’ సక్సెస్ తో కమెడియన్ రోల్స్ కు బ్రేకులు వేసిన సునీల్, చాలా సంవత్సరాల తర్వాత “సిల్లీ ఫెలోస్” చిత్రం ద్వారా కమెడియన్ గా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న సునీల్ లో మునుపటి తేజస్సు, ఉత్సాహం తాండవిస్తోంది.

సినిమా సక్సెస్ భారాన్ని మోయడం అంత ఈజీ కాదు. బహుశా ఆ భారాన్ని వదిలించుకుని, తన మెయిన్ రూట్ లోకి వచ్చేసానని భావించారో ఏమో గానీ, ఇప్పుడు చాలా రిలాక్స్ డ్ గా కనపడుతున్నాడు. నిజానికి తాను మళ్ళీ కమెడియన్ గా చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని, చాలామంది శ్రేయోభిలాషులు కూడా ఇదే కోరుకున్నారని తెలిపారు.

అమెరికాకు వెళ్ళినపుడు కూడా చాలామంది సినీ అభిమానులు తనను మళ్ళీ కమెడియన్ గా చూడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారని, ‘సిల్లీ ఫెలోస్’ ద్వారా అది మొదలవుతుందని అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల ‘అరవింద సమేత’ సినిమాలో, శ్రీనువైట్ల – రవితేజ ‘అమర్ అక్బర్ అంటోనీ’లో, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’లో చేస్తున్నానని ఎంతో ఉల్లాసభరితంగా చెప్పుకొచ్చాడు సునీల్.