sundeep kishan Tenali Rama Krishna BABL targerts YS Jaganసందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని థియేటర్లలో సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు వేశారు. అయితే ప్రీమియర్ల నుండి వచ్చిన టాక్ ఆశాజనకంగా అయితే లేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సినిమా మీద కొత్త వివాదం చెలరేగుతుంది.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయట. “జైలుకి వెళ్లొచ్చిన వారి పొలిటికల్ కెరీర్ స్ట్రాంగ్ గా ఉంటాది”, “ఏం బాబూ నువ్వు గ్రామ వాలంటీర్ వా? మా సరుకులన్నీ టైం కు రావాలి” వంటి డైలాగులు వైఎస్సార్ కాంగ్రెస్ ని టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అంటున్నారు.

అదే సమయంలో కోడి కత్తి సీన్ కూడా ఉందట. వరుస ప‌రాజ‌యాల త‌ర్వాత `నిను వీడ‌ని నీడ‌ను నేను` చిత్రంతో సందీప్ కి కొంత రిలీఫ్ ద‌క్కింది. ఆ సినిమా ఫ‌ర్వాలేద‌నిపించింది. ఈ సినిమా మీద ఆయన భారీ ఆశలే పెట్టుకున్నాడు. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమాకు సరైన పోటీ లేకపోవడం కలిసి వచ్చే అంశం. సినిమాలో కథ, కామెడీ మరీ అవుట్ డేటెడ్ గా ఉన్నాయని పలువురు అంటున్నారు.

సందీప్‌ కిషన్‌, హన్సిక జంటగా నటిస్తున్న తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ కు జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి ఆంజనేయులు సమర్పణలో, అగ్రహారం నాగిరెడ్డి, కె సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సాయి కార్తీక్ స్వరాలు సమకూర్చారు.