Sumanth yet to start shooting from akkineni familyఅక్కినేని ఫ్యామిలీ నుండి మరో హీరో – సుశాంత్ కూడా షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ సినిమా వ‌చ్చే వారం షూటింగ్‌ను ప్రారంభించేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 20 ఆదివారం న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం యొక్క కొత్త పోస్ట‌ర్‌ను చిత్రం బృందం విడుద‌ల చేసింది.

అక్కినేని ఫ్యామిలీలోని హీరోలు – నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ తమ షూటింగులు ప్రారంభించారు. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొంటుండగా… నాగచైతన్య తన లవ్ స్టోరీ.. అఖిల్ తన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నారు.

అక్కినేని ఫ్యామిలీలో ఒక్క సుమంత్ తప్ప అందరు షూటింగ్ మొదలుపెట్టారు. సుమంత్ కూడా తన తదుపరి చిత్రం… కపటధారి షూటింగ్ తొందరలో మొదలుపెడతాడని సమాచారం. ఒక పక్క స్టార్ హీరోలు తమ సినిమాల షూటింగులు మొదలుపెట్టడానికి ఆలోచిస్తుంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగేసింది.

ఇక ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమా సంగతికి వస్తే… ఎస్‌. ద‌ర్శ‌న్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టంల కామెడీ పార్టీ హైలైట్ అని అంటున్నారు.