Sujay krishna Ranga Rao comments on pawan kalyanజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి సుజయ కృష్ణ రంగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర లక్ష్యం ఏంటో తెలియడం లేదన్నారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఆనాడు రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లో అన్న చిరంజీవి తన పార్టీని విలీనం చేస్తే…ఇప్పుడు రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని విమర్శించకుండా తమ్ముడు పవన్.. సీఎంపై బురదజల్లుతున్నారని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు దుయ్యబట్టారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి అందరినీ కలిశారని గుర్తుచేశారు.

కాగా ఏపీ విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబును విమర్శిస్తున్న ఆయన నాలుగేళ్లలో హోదా కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని విమర్శించకుండా సీఎం చంద్రబాబునే విమర్శిస్తున్నారని అన్నారు.