Subhash Chandra Bose, Netaji Subhash Chandra Bose Japan Reports, Netaji Subhash Chandra Bose Japanese Report, Subhash Chandra Bose Japanese Reportమిస్టరీగా మారిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై తాజాగా జపాన్ ఓ నివేదికను తాయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం, 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ (తైవాన్)లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ‘బోస్ ఫైల్స్.ఇన్’ అనే వెబ్ సైట్ లో పొందుపరిచారు. 1945 ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం తైపీ ఆర్మీ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ కాగానే విమానపు ఒక రెక్క తెగిపోయిందని, దీంతో విమానం అదుపు తప్పి కుప్పకూలిపోయిందని ఆ నివేదిక సారాంశం.

కూలిపోయి, మంటలు కక్కుతున్న ఆ విమానంలో నుంచి కాలిన గాయాలతో బయటపడ్డ బోస్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తైపీ ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న నేతాజీ ఆ రోజు రాత్రి 7 గంటలకు చనిపోయారు. ఆగస్ట్ 22 న తైపీ మున్సిపల్ శ్మశానవాటికలో నేతాజీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. నేతాజీ మరణంపై జపాన్ ప్రభుత్వం 1956లోనే ఒక నివేదిక తయారు చేసింది.

జపనీస్, ఇంగ్లీషు భాషల్లో వరుసగా ఏడు, పది పేజీలున్న ఈ నివేదికను టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి అందజేసింది. అయితే, ఈ నివేదికను రహస్య నివేదికగా పేర్కొనడంతో భారత్, జపాన్ దేశాలు దీనిని బయట పెట్టలేదని సదరు వెబ్ సైట్ స్పష్టం చేసింది. మరి ఈ తాజా సమాచారంతో నేతాజీ మృతిపై మిస్టరీ వీడినట్లే భావించాలా? లేక ఇంకేమైనా ట్విస్ట్ లు ఉన్నాయా? ఆ దేవుడికే తెలియాలి..! అంటున్నారు దేశభక్తులు.