Stampede at mahesh babu fans photo shootస్టార్ హీరోలు తమ ప్రతీ సినిమా విడుదలకు ముందు వివిధ జిల్లాల నుండి వచ్చే అభిమానులకు రెండు మూడు రోజుల పాటు ఫోటోలు ఇస్తారు. దీని కోసం ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి విరివిగా ఏర్పాట్లు చేస్తారు. హీరో స్థాయిని బట్టి వేల కొద్దీ అభిమానులు హైదరాబాద్ వస్తారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ విడుదల సందర్భంగా సరిగ్గా ఇదే జరిగింది.

ఈరోజు నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అభిమానులకు ఫోటోలు అని ప్రకటించారు. 1500 మందికి ఏర్పాట్లు చేస్తే తొలి రోజే 7000-8000 మంది వచ్చారట. దీనితో పరిస్థితులు చెయ్యి దాటిపోయి తొక్కిసలాట కూడా జరిగింది. కొంత మంది ఫ్యాన్స్ కు స్వల్ప గాయాలు కూడా అయ్యాయని సమాచారం.

దానితో ఈరోజు ఫోటో సెషన్ తొందరగా ముగించేశారు. రేపు వేదిక మార్చడం గానీ మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయ్యడం గానీ చేస్తారని సమాచారం. ఇది ఇలా ఉండగా కొంత చోటా మోటా ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు పాసులు అమ్ముకుంటున్నారని కొందరు అభిమానులు ఆరోపించారు. దీనిపై మహేష్ బాబు బృందం స్పందించి హీరోకు సంబందించిన ఏ ఈవెంట్ కైనా పాసులు ఉచితమే అని ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరూ నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 6న సినిమా సెన్సార్ జరుగుతుందని సమాచారం. 11న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.