టీవీ ఛానెల్లో తన విధులు పూర్తి చేసుకుని అర్ధరాత్రి సమయంలో తన స్కూటీపై ఇంటికి వెళుతోన్న యాంకర్ దామినిని ఇద్దరు వ్యక్తులు బైక్పై వెంబడించారు. చివరకు ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది.
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఎంజీ రోడ్ భగవాన్ టాకీస్ నుంచి తనను ఇద్దరు వెంబడించారని, వారు తన వెనకాలే వచ్చారని, చాలా భయానికి గురైన తాను వేరే దారి గుండా వెళదామని నిర్ణయించుకుని, దారి మళ్లానని, అయినప్పటికీ ఆ యువకులు తన వెనకాలే వచ్చారని తెలిపింది.
చివరకు వారి నుంచి తాను తప్పించుకున్నానని చెప్తూ…. సదరు వ్యక్తుల ఫోటోలను మరియు వారు వినియోగించిన బైక్ నెంబరును కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.