అమరావతి పాలన నగర ఆకృతులకు సంబంధించి దర్శకుడు రాజమౌళి సహాయాన్ని ఏపీ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఏపీ మంత్రి నారాయణ బృందంతో పాటు లండన్లో ఉన్నారు. బృందంలో నారాయణతోపాటు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
పాలనా నగరంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ వర్క్ షాప్ను ఆయన ఆసక్తికారంగా తిలకించారు. తరువాత నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో వీరు చర్చించారు. నిర్మాణాలకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు రాజమౌళి పలు సూచనలు చేశారు.
వీటి ఆధారంగా తొందర్లోనే వాళ్ళు ఫైనల్ ఆకృతులు తయారుచేస్తారు. ఈ .నెల చివరన ముఖ్యమంత్రి లండన్ వెళ్ళి నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ఫైనల్ ఆకృతులు చూసి, ఆయన సంతృప్తి చెందితే అతి త్వరలో భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతారు. 2018 చివరికల్లా పూర్తి చెయ్యాలని లక్ష్యం.