Sri-Reddy-Latestతెలుగు, తమిళ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ‘మా’ ఆఫీస్ ముందు ఆవిడ చేసిన దర్నా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే ఆ తర్వాత కూడా శ్రీ రెడ్డి అనేక మంది పై తనను ఇబ్బందులు పెట్టారు అంటూ ఆరోపణలు చేసింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాత కుమారుడు తనని అన్ని రకాలుగా ఉపయోగించుకుని చివరకు తనని ఒంటరి దాన్ని చేశాడు అంటూ ఫోటోలు బయట పెట్టి సంచలనమే సృష్టించింది. ఆతర్వాత కూడా పలు మార్లు రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చినప్పటికీ ఆమె తాజాగా చెన్నై కి వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటుంది.

అయితే ఆమె ఎన్ని సినిమాలు చేస్తుంది. అసలు ఏం చేస్తుంది అని తెలీదు కానీ, మళ్లీ సడన్ గా తెరపైకి వచ్చి ఫేస్‌బుక్ ఆధారంగా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ వివరాల్లోకి వెళితే తాను తమిళంలో సినిమాలు చేసుకుంటూ ఉన్నాను అని, కానీ ఒక తమిళ హీరో తనని ఇబ్బంది పెడుతున్నాడు అని, నిజాలు బయట పెట్టడం వల్లనే తాను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని, ఆ హీరో నన్ను చంపేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అని, అదే జరిగితే నేను సైన్ చేసిన సినిమాలు నా శవం చేస్తుందేమో అని. ఆ హీరో నన్ను ‘పబ్లిక్ టాయిలెట్’కన్నా దారుణంగా వాడుకున్నాడు అని, ఆహీరో నా ఒంటిపై చేసిన గాయాలు ఎప్పటికీ మానవు అని ఫేస్‌బుక్ లో పెట్టింది. అదే క్రమంలో గతంలో తాను లారెన్స్ పై అనేక అభియోగాలు చేసినప్పటికే ఇప్పుడు ఆయన తనకు సినిమాలో అవకాశం ఇవ్వడంతో తనని మంచివాడుగా పరిగణిస్తుంది.

అసలు ఇంతకీ ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి చెప్పినట్లు అంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అన్నది నిజమే, దాన్ని ఎవ్వరూ కాదు అని అనలేని పరిస్థితి. కానీ మరీ అంతలా వాడుకుని, ఆ తర్వాత వదిలేసే సంస్కృతి ఉంది అంటే నమ్మశక్యం కానీ విషయమే. ఏది ఏమైనా, ఒక పక్క శ్రీ రెడ్డి పోరాటం, మరో పక్క మీటూ పోరాటం వల్ల, నటనను కరియర్ గా తీసుకున్న, తీసుకోవాలి అని అనుకున్న లేడీ ఆర్టిస్ట్స్ కి మంచి జరగాలి అని కోరుకుందాం.