sri-konathala-rama-krishnaగత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్న మాజీ వైసీపీ నేత కొణతాల రామకృష్ణ అంశంపై క్లారిటీ వచ్చేసినట్లే. మంత్రి అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీంతో వీరిద్దరి ఎంట్రీకి రంగం సిద్ధమైంది, ఇక అధికారిక ప్రకటనే తరువాయి..! టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వాలని సంప్రదింపులు జరుపుతున్న కొణతాల వర్గానికి ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లుంది.

వాస్తవానికి… జగన్ నుండి దూరమైన తర్వాత బిజెపిలోకి కొణతాల రంగ ప్రవేశం చేయబోతున్నారన్న వార్తలు హల్చల్ చేసాయి. అయితే కొంత కాలం వరకు స్తబ్దుగా ఉన్న ‘కొణతాల అండ్ కో’ చివరికి అధికార పార్టీ వైపుకే మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలలో కొణతాల ఒకరు. ఆ అభిమానాన్నే జగన్ పై చూపించి మోసపోయానని కొణతాల రాసిన లేఖ వైసీపీలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.