Split in Dil raju partnersదిల్ రాజు సంస్థలో చాలా సంవత్సరాలుగా పార్టనర్స్ శిరీష్ – లక్ష్మణ్. అయితే ఏమైందో ఏమో గాని ఇటీవలే లక్ష్మణ్ సంస్థని నుండి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. గతంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చూసుకున్న ఆయన ఇప్పుడు నైజాం లో సొంత సంస్థ ఏర్పరుచుకుని బిజినెస్ చెయ్యబోతున్నారు.

అది కూడా ఆషామాషీగా కాకుండా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే చిరంజీవి… కొరటాల సినిమా నైజాం రైట్స్, పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా నైజాం రైట్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. నైజాం అనేది దిల్ రాజు సొంత ఇలాకాగా ఉంది చాలా రోజులుగా. దాదాపుగా ఆయన ఏక చక్రాధిపత్యం అనే చెప్పుకోవాలి.

ఇప్పుడు అక్కడే దిల్ రాజుకు ఎర్త్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మణ్. ఇది ఇలా ఉండగా… చిరంజీవి… కొరటాల సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా సంగతికి వస్తే… మొదట్లో 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రానుండడంతో ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి. ఈ రెండు సినిమాల పంపిణీ సక్సెస్ అయితే నైజాం బిసినెస్ లోకి ఇంకో పెద్ద ప్లేయర్ ఎంటర్ అయినట్టే.