special shows in hyderabad for prabhas fans on his birthdayకొన్నేళ్ళు గడిచాక ఏ సినిమా అయినా ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మళ్ళీ ఆ సినిమాలను థియేటర్స్ లో వేస్తూ సరికొత్త ట్రెండ్ మొదలు పెట్టారు స్టార్ హీరోల ఫ్యాన్స్. స్టార్ హీరో బర్త్ డే అయినా , యానివర్సరీ అయినా స్పెషల్ షో పడాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. హీరో రామ్ -సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘జగడం’ తో ఈ స్పెషల్ షో ట్రెండ్ స్టార్టయింది. ఆ సినిమా విడుదలై 14 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ షో ఏ ఎం బీ సినిమాస్ లో స్పెషల్ షో వేసుకొని ఎంజాయ్ చేశారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ యానివర్సరీ స్పెషల్ గా ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో ‘ఆది’ సినిమా వేసుకున్నారు. ఇక పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఇటివలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘గబ్బర్ సింగ్’ స్పెషల్ షో వేసి దాని నుండి వచ్చిన టికెట్ డబ్బులను అదే థియేటర్ లో వర్కర్స్ కి ఇచ్చేశారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇటివలే చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షో వేసుకున్నారు. దానికి టీంతో పాటు కొందరు దర్శకులను ఇన్వైట్ చేశారు. అలాగే మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ మధ్యే పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా చోట్ల దూకుడు స్పెషల్ షోస్ వేశారు.

ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ వంతు. ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆంధ్రాలో అధిక థియేటర్స్ లో ‘మిర్చి’ , హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ‘బిల్లా’ వేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ షో లకు సంబంధించి టికెట్లు భారీ అమ్ముడు పోయాయి. నిజానికి శివ రాత్రి కి మాత్రమే ఇలా ఎప్పుడో రిలీజైన సినిమాలు మళ్ళీ థియేటర్స్ లో వేసేవారు. కానీ ఇప్పుడు స్టార్స్ మీద అభిమానంతో మళ్ళీ ఆ పాత సినిమాలను థియేటర్స్ లో చూస్తూ ఆ రొజుని స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్యాన్స్ స్టార్ట్ చేసిన ఈ కొత్త ట్రెండ్ ఇంకా ఎన్ని సినిమాలతో ముందుకు వెళ్తుందో చూడాలి.