Sonu Sood’s Charity On Acharya Setఇండియన్ రియల్ సూపర్ హీరో సోను సూద్ లాక్ డౌన్ కాలం నుండీ ఏదో ఒక మంచి పనితో వార్తల్లో ఉంటూనే ఉంటున్నాడు. తాజాగా అతను హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫిలిం లొకేషన్ లో చేసిన ఒక మంచి పనితో అతను అందరి మన్ననలు పొందుతున్నాడు.

సోను సూద్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సెట్ లో 100 స్మార్ట్ ఫోన్ లు పంచాడు. ఆచార్య సెట్ లో పనిచేస్తున్న 100 మంది పేద కార్మికులకు ఫోన్ లను పంచి పెట్టాడు. కొత్త సంవత్సరం సందర్భంగా వారి మొహాల్లో చిరునవ్వు నింపాడు. వారు ఎంతో ఆనంద పడడమే కాదు, సోను సూద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

సోను సూద్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. బహుశా సోను విలన్ గా నటించబోయే చివరి సినిమా ఇదే కావొచ్చు. ఇక నుండి హీరో గానే నటించాలని అతను నిర్ణయించాడు. విభిన్న భాషలలో విడుదల కాబోయే కిసాన్ అనే చిత్రంలో అతను హీరోగా నటించబోతున్నాడు.

సోను సూద్ ని మరీ బ్యాడ్ గా చూపిస్తే ప్రేక్షకులు ఒప్పుకోరేమో అని ఆచార్య స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. ఇకపోతే సోను కొత్త ఇమేజ్ తరువాత విడుదలయ్యే మొదటి చిత్రం అల్లుడు అదుర్స్. ఈ నెల 15న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల అవుతుంది. హీరో తో సమానంగా సోను ని పోస్టర్ల మీద చిత్రం యూనిట్ ప్రమోట్ చెయ్యడం విశేషం.