Somu Veerraju warns chandrababu naiduబీజేపీ అధ్యక్ష పీఠం దొరకకపోవడంతో కొంత స్లో ఐన సోము వీర్రాజు అడపాదడపా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని తిడుతూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

.”భగవంతుడే చూస్తాడు..పంచభూతాలే సాక్ష్యాలు..చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి” అంటూ ఆయన హెచ్చరించారు. చంద్రబాబుకు ఏదో కీడు జరగబోతుందని సోము భయపెడుతున్నారా? లేదా బీజేపీ వారే దానికి ఏమైనా ప్లాన్ చేసి దేవుడి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని టీడీపీ అభిమానులు అంటున్నారు.

అంతే కాకుండా అవినీతి సీఎం చంద్రబాబు విషయంలో గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును బర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆ గవర్నర్ కు పదవి సమయం పూర్తయిపోయినా కొనసాగిస్తోంది బీజేపీ వారే కదా?