విశాఖ కేంద్రం గా రాజకీయాలు చేసే టి. సుబ్బరామిరెడ్డి మద్దతుతో బాగా పాపులరైన స్వరూపానంద తరచు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ టీడీపీని ఇరుకునపెడుతూ జగన్ కు మద్దత్తు ఇస్తూ ఉంటారు ఈ సాములోరు. వైఎస్ జగన్ తన మీద ఉన్న క్రిష్టియన్ అనే ముద్ర తొలగించుకోవడానికి స్వరూపానంద ఆధ్వర్యంలో అనేక పూజలు, యజ్ఞాలు చేస్తుంటారు కూడా.
ఇప్పుడు ఏకంగా బీజేపీ, వైకాపా మధ్య పొత్తు చర్చలు జరుపుతున్నారట. సాక్షాత్తు ఆయన ముందే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జగన్ నమ్మినబంటు విజయ సాయి రెడ్డి వినమ్రంగా కూర్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సోము వీర్రాజు బీజేపీలోని టీడీపీ వ్యతిరేక వర్గానికి న్యాయకత్వం వహిస్తూ ప్రభుత్వాన్ని తరచూ ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
బీజేపీ అధినాయకత్వానికి తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క పరమపవిత్రంగా ఉండాల్సిన పీఠాలు ఇలా రాజకీయ చర్చలకు నిలయం చెయ్యడం ఎంతవరకు సమంజసమో ఆ స్వామికూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వాటి వల్ల మొత్తం హిందూ మతానికే చెడ్డ పేరు వస్తుంది.