Telugu

జగన్ మీద ఉన్న అభిమానంతో సొంత పార్టీని ఇరుకునపెడుతున్నారు!

Share

మొన్న ఆ మధ్య పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదని, ఇందుకు సంబంధించి ఎటువంటి విచారణా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. గతంలో అవినీతి పై చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది అని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం గమనార్హం.

అయితే రాష్ట్ర బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేక వర్గానికి మాత్రం ఈ వార్త మింగుడుపడటం లేనట్టుగా ఉంది. “పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని అవినీతి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయాలి,” అంటూ ఆ పార్టీ నేత సోము వీర్రాజు చెప్పడం గమనార్హం.

కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చినా వీర్రాజు వంటి వారికి ఇంకా తత్త్వం బోధపడకపోవడం విశేషం. మరోవైపు… రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ… “పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్దాలే. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చేసిన ఇళ్లు ఎందుకు పంపిణీ చేయరని టీడీపీ నేతలు ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉంది,” అన్నారు.

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేసింది. సహజంగా నిర్మాణం పూర్తి కాకుండా కేంద్రం తన వంతు నిధులు విడుదల చెయ్యదు. వీర్రాజు చెప్పినట్టు ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా నిధులు విడుదల చేసినట్టు అయితే చంద్రబాబుతో కలిసి మోడీ ప్రభుత్వం అవినీతి చేసినట్టా? జగన్ మీద ఉన్న అభిమానంతో సొంత పార్టీని ఇరుకునపెడుతున్నారు!