somireddy chandramohan reddyదేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ భంగపడింది. ఒక చిన్న రాష్ట్రం, ఒక కేంద్ర పాలిత ప్రాంతం తప్ప ఎక్కడా గెలవలేకపోయింది. పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో పరాజయం తప్పలేదు. ఈ రెండు రాష్ట్రాలలో ప్రశాంత్ కిషోర్ పని చేసిన పార్టీలే విజయం సాధించాయి.

అయితే ఇటువంటి తరుణంలో గతంలో బీజేపీ ఉన్న శతృత్వం గుర్తొచ్చో ఏమో టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ట్విట్టర్ లో ప్రశాంత్ కిషోర్ పనితనం మీద పొగడ్తలు కురిపించారు. సోమిరెడ్డి స్పీడ్ కి సొంత పార్టీ అభిమానులు కూడా కంగుతిన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్ధమవుతుందా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

“బెంగాల్,తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ టీంలే గెలిచాయి. ను బీజేపీ ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదు. దేశంలోనే ఆమె వీరనారిగా గెలిచారు.తమిళనాడులోనూ పీకే స్ట్రాటజీనే పైచేయి సాధించి స్టాలిన్ ను సీఎం చేస్తోంది.మొత్తంగా పీకే వ్యూహాలే విజేతలయ్యాయి,” అంటూ ట్వీట్ చేశారు.

అసలు బీజేపీని ఆక్షేపించే క్రమంలో 2019లో తమ పార్టీ ఘోర పరాజయానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ని ఆకాశానికి ఎత్తడం ఏంటో ఆయనకే అర్ధం కావాలి. ప్రశాంత్ కిషోర్ టీమ్ అనేక రకాలుగా చంద్రబాబు, లోకేష్ ల వ్యక్తిత్వ హనం చేసి ఆ ఎన్నికలలో గెలిచారని టీడీపీ అభిమానుల అభిప్రాయం. అటువంటి పీకేని ఆకాశానికి ఎత్తడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.