Somireddy Chandra Mohan Reddy comments on ys jagan mohan reddyవైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే తమ పరిస్థితేమిటనే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ ఈడీ కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని, 11 కేసుల్లో జగన్ పై విచారణ జరుగుతోందని, జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గందరగోళంలో పడిపోయారని అన్నారు.

దీంతో ముందు వారి భవిష్యత్తును చూసుకోవడంలో నిమగ్నమయ్యారని, ఆ కోవలోనే ఈ వలసలు అని, మున్ముందు మరింత మంది టీడీపీలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు జైల్లో ఉంటుందా? బయట ఉంటుందా? అనే అనుమానంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి మంచి పాత్ర పోషించటం లేదన్న అనుమానంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని సోమిరెడ్డి అన్నారు.