వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పాము కలకలం సృష్టించింది. రెండో బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో ఉద్యోగులకు ఇది కనిపించడంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు కార్యాలయాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ఇది బయటకు వచ్చింది. అప్రమత్తమైన కార్మికులు దాన్ని వెంటనే చంపేశారు.
దీనితో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా పర్యటనలో ఉండడంతో సచివాలయం పెద్దగా సందడి లేదు. మంత్రులంతా వారి నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు. దీనితో సందర్శకుల తాకిడికూడా పెద్దగా లేదు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.
ఈ సందర్బంగా బూసన్ బిజినెస్ సెమినార్లో ఆంధ్రప్రదేశ్కు, మేకిన్ ఇండియా కొరియా సెంటర్కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఎంఐసీ (మేకిన్ ఇండియా కొరియా సెంటర్) ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తుంది. అలాగే బూసన్లో ఆంధ్రప్రదేశ్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. బిజినెస్ సెమినార్లో మధ్యాహ్న భోజన సమావేశంలో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.