singles-anthem-bheeshma-nithiin-rashmikaయంగ్ హీరో నితిన్, రష్మిక కాంబినేషన్ లో వస్తున్నా భీష్మ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఈరోజు మొదలు పెట్టింది చిత్రబృందం. చిత్రంలోని ఒక పాటను సింగిల్స్ యాంధమ్ గా విడుదల చేశారు. ఈ పాట వినాశంపుగా, వెంటనే ఎక్కేసేలా ఉంది. మధ్యలో ఒక చోట డల్ గా అనిపించినా ఓవర్ ఆల్ ఇంపాక్ట్ అయితే బావుంది.

అయితే కొంత లెంగ్త్ ఎక్కువగా ఉంటే బావుండేది అంటున్నారు. మొత్తానికి ఈ పాటతో సినిమా ప్రమోషన్స్ కు మంచి స్టార్ట్ దక్కింది అనే చెప్పుకోవాలి. భీష్మ షూటింగ్ ప్రస్తుతం రోమ్ లో జరుగుతుంది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట.

మరోవైపు ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. ఆ మాటకొస్తే అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో నితిన్ భీష్మ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నితిన్ కేరీర్ కు కీలకం కాబోతుంది.

భీష్మ కాకుండా ఇప్పటికే నితిన్ మరో రెండు సినిమాలు పట్టాలెక్కించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే… చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చదరంగం అనే సినిమాలు ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్నాయి. ఈ ఏడాది విడుదల అనుకున్న భీష్మ ఫిబ్రవరికి వాయిదా పడటంతో ఈ మూడు సినిమాలూ 2020లోనే విడుదల కానుండడం విశేషం.