సింగర్ సునీత తిరిగి వివాహం చేసుకోవడం గురించి చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఆమె ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికం చేసింది. టాలీవుడ్ డిజిటల్ మీడియా స్టాల్ వర్ట్ అయిన మ్యాంగో మీడియాకు చెందిన రామ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. తికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఆమె ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది . యుక్తవయసులో ఉన్నప్పుడు సునీత తన మొదటి భర్తతో వివాహం జరిగింది. అయితే తరువాత వారు విడాకులు తీసుకున్నారు. ఆమె ఒక దశాబ్దానికి పైగా ఒంటరిగా ఉంది. 43 ఏళ్ల సునీతకు ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు, ఇద్దరూ తమ జీవితంలో స్థిరపడ్డారు.
తన నలభైల చివరలో ఉన్న రామ్ కూడా చాలా కాలం క్రితం భార్య నుండి విడిపోయాడు. తమ జంట ఉన్న రెండు చిత్రాలను పోస్ట్ చేసి సునీత ఈ ప్రకటన చేసింది. కొత్త జంట సునీత తల్లిదండ్రులు మరియు ఆమె పిల్లలతో కలిసి ఉన్న చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత.
పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. మొత్తానికి ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు కూడా ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయి. ఈ కొత్త జంటకు మా శుభాకాంక్షలు.