మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమమ్’ను అక్కినేని హీరో నాగచైతన్య రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇదే చిత్రంలో మరో హీరోయిన్గా శృతిహాసన్ నటించబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటి వరకు అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్లో శృతిహాసన్ ముఖ్య పాత్రలో కనిపించనుందట.
‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్ను’ చిత్రంలో శృతిహాసన్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పాత్ర ప్రాముఖ్యత దృష్ట్యా హీరోయిన్గా కాకున్నా కూడా శృతిహాసన్ ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ‘కార్తికేయ’ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే ఈ రీమేక్లో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో పలువురు స్టార్స్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.