Prabhas Saaho Heroine Shraddha Kapoor Officially Announced‘బాహుబలి 2’ తర్వాత ‘నేషనల్ ఐకాన్’గా మారిన ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ తదుపరి చిత్రం “సాహో”పై అందరి కళ్ళు ఉన్న విషయం తెలిసిందే. దాదాపుగా 150 కోట్లతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరన్న దానిపై అనేక తర్జనభర్జనలు జరిగిన సంగతులు నెటిజన్లకు విదితమే. అయితే ఎట్టకేలకు బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ ఫైనల్ కావడంతో, ఈ వార్త గత రెండు రోజులుగా వెబ్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

దానిని ధృవీకరిస్తూ తాజాగా శ్రద్దా కపూర్ ఓ ట్వీట్ చేసింది. ‘సాహో టీంలో తానూ ఓ భాగం అయినందుకు బాగా ఎక్సైటింగ్ గా ఉందని, ప్రభాస్ తో పని చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఎగిరి గంతేసిన ఓ ఎమోజీని పోస్ట్ చేసి తన ఫీలింగ్ ఏంటో అభిమానులకు చెప్పింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించినందుకు దాదాపుగా 6 కోట్లు పుచ్చుకుంటోందని ట్రేడ్ టాక్.