Selfie with Harikrishna Deadbodyసెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎప్పుడు, ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

యావత్తు తెలుగు జనలోకం ఆయనకు అశ్రునివాళి అర్పించింది. అయితే పూర్తిగా విచక్షణ మర్చిపోయి ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఏదో ఘనకార్యం సాధించినట్టు దానిని సోషల్‌మీడియాలో షేర్‌ చేసి రాక్షసానందం పొందారు.

ఎలాంటి సందర్భాల్లో సెల్ఫీలు దిగాలో కూడా తెలియని దయనీయ స్థితికి మన సమాజం వచ్చేసినందుకు సిగ్గు పడాలి. సాక్షాత్తు వైద్య వృత్తిలో ఉండి కూడా ఇలాంటి పనులకు పాల్పడటం మన దౌర్బాగ్యం. అసలు ఆయన తనువుచాలించినప్పుడు తీసినవో లేక వైద్యం మానేసి తీసినవో అని ఇంకొందరు అనుమానపడుతున్నారు.