వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మతో వైఎస్ జగన్ బావ, మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ శుక్రవారం హైదరాబాద్లోని పార్క్హయత్ హోటల్లో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ఘట్టాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని వర్మ రూపొందించనున్నారు. ఈ తరుణంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది.
వర్మ, అనిల్ మాట్లాడుకున్న విషయానికి సంభందించిన వీడియో సోషియల్ మీడియాలో హూల్చల్ చేస్తుంది. వారి భేటీని ఆ చిత్ర నిర్మాత రాకేష్రెడ్డి ధ్రువీకరించారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కించ పరిచేలా సినిమా తీయమని వర్మ ను ప్రోత్సహిస్తున్నారని పుకార్లు షీకరు చేస్తున్నాయి.
” చర్చల నిమిత్తం నేను, వర్మ కలిసి నటుడు జేడీ చక్రవర్తి కార్యాలయానికి వెళ్లాం. మధ్యాహ్న భోజనం కోసం పార్క్హయత్కు వెళ్లాం. అక్కడ బ్రదర్ అనిల్ కలిశారు. వర్మకు అనిల్ను నేనే పరిచయం చేశా. భోజన సమయంలో కాసేపు మాట్లాడుకున్నాం. ఎక్కడా సినిమాకు సంబంధించిన అంశాలు చర్చకు రాలేదు. ఈ భేటీ కాకతాళీయమే,” అని ఆయన అన్నారు.