Savyasachi Audio talkపాత పాటలను రీమిక్స్ చేయడం… అవి నిరుత్సాహానికి గురి చేయడం… గత కొన్నేళ్ళుగా జరుగుతూనే ఉంది. దీంతో ఈ ట్రెండ్ కు ఇటీవల బ్రేక్ పడింది. కానీ చైతూ “సవ్యసాచి”లో కింగ్ నాగార్జున ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయెత్తు’ సాంగ్ ను రీమిక్స్ చేసారు. పాత పాటను స్వరపరిచిన ఎం.ఎం.కీరవాణినే ఈ రీమిక్స్ ను కూడా చేయడంతో, ఈ పాట కూడా అదిరిపోతుందని భావించారు.

కానీ అందుకు విభిన్నంగా శ్రోతలను అలరించడంలో ‘నిన్ను రోడ్డు మీద’ సాంగ్ నిరుత్సాహపరిచింది. నిజానికి ఈ ఆల్బమ్ లో ఊపున్న సాంగ్ ఇదొక్కటే. మిగిలనవన్నీ స్లో సాంగ్స్. కానీ పాత పాటను మదిలో పెట్టుకుంటే, ఈ పాట కూడా అంతగా అలరించదు. ముఖ్యంగా నాగార్జున సాంగ్ లో ఉన్న ఊపు, జోష్ ఈ సాంగ్ లో మిస్ అయ్యింది. మొదటిసారి వింటే ఎక్కే అవకాశాలు లేవు గానీ, వినగావినగా ‘ఓకే’ అనిపిస్తుంది.

నాడు వేటూరి అందించిన సాహిత్యాన్ని అలా ఉంచి, ట్రెండ్ పేరుతో రీమిక్స్ లో వర్షన్ ను కొంత రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇక పృథ్వి చంద్ర, మౌనిమ స్వరాలు కూడా పాత పాట ముందు తేలిపోయాయి. మొత్తంగా అక్కినేని అభిమానులకు “సవ్యసాచి” ఆల్బంలో ఊహించిన కిక్ అయితే దక్కలేదు. బహుశా సిల్వర్ స్క్రీన్ పైన ఏమైనా ఒక ఊపు ఊపుతుందేమో చూడాలి.