Sarileru-Neekevvaru train scene shootingసూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం కోసం ఒక ట్రైన్ సెట్ నిర్మించారు. ఈ సెట్ లో సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన కామెడీ సన్నివేశం షూట్ చేస్తున్నారు. ఇది మొత్తం చిత్రానికే హైలైట్ అనే అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు. ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు ఇప్పటికే కాశ్మీర్ లో పూర్తి చేశారు.

ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటిదాకా చిన్న హీరోల తో పని చేసిన ఆమె ఈ చిత్రంతో పై స్థాయికి వెళ్లబోతుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ చెయ్యాల్సి ఉంది.

పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా….మంచి యాక్షన్ సినిమాగా ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సీరియస్ మెస్సేజ్ సినిమాలే తీస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో తన పంథా మారుస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ చేసిన ‘ఖలేజా’, ‘దూకుడు’, ‘ఆగడు’ సినిమాల్లో కామెడీ ప్రధాన భూమిక పోషించింది. ఇప్పుడు ఇది కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతుండడంతో మహేశ్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.