Sarileru Neekevvaru Pre Release event on 5th Jannuary 2020సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం మైండ్ బ్లాక్ పాట అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ చేస్తున్నారు. ఈ పాట తరువాత కేవలం రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంటుంది. సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇది ఇలా ఉండగా జనవరి 5న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగబోతుంది. ఎల్బీ స్టేడియం ను బుక్ చేశారు. గతంలో మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. మహర్షి మహేష్ బాబు కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్, దానితో సెంటిమెంట్ గా దానినే వేదికగా నిర్ణయించారు ఈ సారి కూడా.

అయితే మహర్షితో అందుకోలేకపోయిన 100 కోట్ల షేర్ ఈ సినిమాతో అందుకుంటారో లేదో చూడాలి. సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. రేపు సినిమా నుండి మరో పాట విడుదల చెయ్యబోతుంది సినీ బృందం.