DSP-Audio-Disappoints,-But-“Mass”ive-Video-Potential-For-Anil-Ravipudiసూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాతలు నిన్న సినిమాకు సంబంధించిన ‘మైండ్ బ్లాక్’ అనే మొదటి పాట విడుదల చేశారు. చాలా హైప్ మధ్య విడుదలైన ఈ పాట చాలా రొటీన్ గా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చాలా రొటీన్ గా, గతంలో ఆయన ఇచ్చిన నేను శైలజ పాటలోని ఒక ట్యూన్ ని పోలి ఉందని అంటున్నారు.

అయితే చిత్ర బృందం మాత్రం ఈ పాట మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. చిత్రంలోని విజువల్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునెలా ఉంటాయని, మరీ ముఖ్యంగా మహేష్ బాబు లుంగీ లో వేసే స్టెప్ అదిరిపోతుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా దేవిశ్రీప్రసాద్ మరోసారి నిరాశ పరిచాడనే చెప్పుకోవాలి. మిగతా పాటలు ఎలా ఉంటాయో అని మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది.

సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా రోజులుగా సాఫ్ట్ రోల్స్ కు పరిమితం అయిపోయిన మహేష్ బాబులోని మాస్ యాంగిల్ ని వెలికితీసాడు దర్శకుడు. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఒక స్టార్ హీరో తో నటించడం ఆమెకు ఇదే మొదటి సారి. దీనితో ఆమె కూడా ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకుంది.